హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ బుధవారం రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను గవర్నర్ నరసింహన్ ఆమోదించారు. టిఆర్ఎస్ శాసనసభాపక్షం విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గవర్నర్ కెసిఆర్ను ఆహ్వానించారు. సిఎం కెసిఆర్ రాజీనామాను ఆయన కార్యదర్శి రాజ్భవన్కు అందజేశారు. సెప్టెంబర్ 6న కెసిఆర్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే, గవర్నర్ సూచన మేరకు అప్పటినుంచి కెసిఆర్ రాష్ట్రానికి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగారు.